నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం నూతన వధూవరులను ఆశీర్వదించారు. పులివెందుల వీజే ఫంక్షన్ హాల్లో జరిగిన జాహ్నవి-ప్రవీణ్ కుమార్ రెడ్డి వివాహ వేడుకకు ఆయన హాజరు అయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువనేతను చూసేందుకు, కరచాలనం చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. మరోవైపు పులివెందులలో నిన్న వైఎస్ జగన్ బిజీ బిజీగా గడిపారు.