2వ రోజు వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం

2వ రోజు వైఎస్ జగన్ సమీక్ష సమావేశం ప్రారంభం - Sakshi


గుంటూరు: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశంలో రెండవ రోజు శుక్రవారం గుంటూరులో ప్రారంభమైంది. గుంటూరు నగరంలోని బండ్లమూడి గార్డెన్స్లో ప్రారంభమైన ఆ సమీక్ష సమావేశానికి నర్సారావుపట, చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నేతలతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.


అంతకుముందు బండ్లమూడి గార్డెన్స్ వరకు వైఎస్ జగన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికలపై గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top