రామారావుపై కేసుల తొలగింపుపై చర్చించాలి


హైదరాబాద్ :  రాష్ట్రవ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపుతో పాటు, టిడిపి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై కేసుల తొలగింపుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం  స్పీకర్‌ కోడెల శివప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల ప్రారంభంలో ఈ అంశాలను ప్రతిపక్ష నేత ప్రస్తావించడంతో.. స్పీకర్ అభ్యంతరం చెప్పారు. వాయిదా తీర్మానం అంశానికి తగిన సమయంలో సమాధానం ఇస్తారని సూచించారు. మరో అంశాన్ని అప్పటికప్పుడు ప్రస్తావించడం సరికాదని తేల్చి చెప్పారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top