ఇప్పటికైనా బాబుకు బుద్ధొస్తుందా!!


కాంట్రాక్టర్లను బాగు చేసేందుకు తాపత్రయపడుతూ  సీఎం చంద్రబాబు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న 'ప్రాజెక్టుల బాట' కార్యక్రమంలో భాగంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం సాయంత్రం పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదిత గ్రామాలను సందర్శించిన ఆయన..  రైతులతో సమావేశమయ్యారు.  



గోదావరి వరద గరిష్ఠంగా 40 నుంచి 60 రోజులు మాత్రమే ఉంటుందని, ఆ సమయంలోనే 80 టీఎంసీల నీటిని ఏ విధంగా తరలిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. వాస్తవ ధరలకంటే 21.9 శాతం అధికంగా ఎస్టిమేషన్లు రూపొందించిది అనునాయుల్ని బాగుపర్చేందుకేనన్నారు. నిర్వాసిత రైతులు సైతం సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులు ముందుకొచ్చి, మైక్ తీసుకొని ప్రభుత్వం తలపెట్టిన అన్యాయాలను ఎకరువు పెట్టారు. డ్వాక్రా రుణాల మాఫీ హామీ ఎగవేతపై మహిళలు మాట్లాడారు. రైతుల ఆవేదన విన్న తరువాతైనా చంద్రబాబు బుద్ధితెచ్చుకోవాలని వైఎస్ జగన్ అన్నారు. బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేని పట్టిసీమ ప్రాజెక్టు కోసం ఇతర ప్రాజెక్టుల నిధులకు కోతలు విధించడం దారుణమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top