చంద్రబాబు అబద్ధాలను నమ్మి రైతులు సర్వనాశనం అయ్యారు: జగన్
హైదరాబాద్: ‘ఇలాంటి రైతులెందరో చంద్రబాబు చెప్పిన అబద్ధాలను నమ్మి సర్వనాశనమయ్యారు. ఇలాంటి రైతుల ఆశలుడిగిపోక ముందే మనమంతా వారి తరపున పోరాడాల్సిన అవసరముంది’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్లో ట్వీట్ చేశారు.
ఆయన ఇటీవల అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో రైతు భరోసా యాత్రను నిర్వహించి ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ యాత్రలో ఆయన ఓ రైతు గోడు తెలుసుకుంటున్న సందర్భంగా తీసిన ఫొటోను ట్విటర్లో ఉంచారు. ఆ రైతును ఉదహరిస్తూ జగన్ పై విధంగా ట్వీట్ చేశారు.