ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూఢిల్లీ చేరుకున్నారు. వైఎస్ జగన్ పార్టీ నాయకులతో సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావలసిన నిధుల అంశాలకు సంబంధించి వైఎస్ జగన్ ప్రధానికి నివేదిస్తారు.విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ అంశాలపై వైఎస్ జగన్ చర్చిస్తారు.