డెంగ్యూతో యువకుడు మృతి


వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ జిల్లాలో ఓ యువకుడు డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. జిల్లా కేంద్రం కడపకు చెందిన పుల్లయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు శివ(20) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటి నుంచి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. డిగ్రీ చదువుతున్న శివ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అతని మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top