విషం తాగి యువకుడి ఆత్మహత్య
దుత్తలూరు(నెల్లూరు) : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ పంచాయతీ పరిధిలోని గుడేవారిపాలెంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. గుడేవారిపాలెం గ్రామానికి చెందిన తిరువెటి రామకృష్ణ(25) శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకి వెళ్లి తిరిగి రాలేదు.
కాగా ఈ రోజు ఉదయం తండ్రి బావి వద్దకు వెళ్లగా.. అక్కడ శవమై పడిఉన్నాడు. ఇది గమనించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.