అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య


బుక్కపట్నం (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని సిద్ధరామపురం గ్రామానికి చెందిన చంద్రమోహన్(35) అనే రైతుకు వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top