'ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఎక్కువ'


హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం రుణమాఫీ చేస్తానన్న మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఎన్నికల కమిషన్కు లేఖ కూడా రాశామన్నారు. ఇప్పుడు అమలు చేస్తున్నదే ఆంక్షలు లేని రుణమాఫీ అని యనమల అన్నారు.


 


ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఎక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులంతా సంతోషంగా ఉన్నారని యనమల చెప్పుకొచ్చారు. కొత్త రుణాల మంజూరుకు బడ్జెట్లో కేటాయింపులు చేయాల్సి ఉందన్నారు. రుణమాఫీ అమలుకు కాలపరిమితి చెప్పలేమని ఆయన అన్నారు. మాఫీ అమలు, రుణమాఫీ సమాంతరంగా జరుగుతాయని యనమల తెలిపారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top