ఆధ్యాత్మికతతోనే దైవత్వం
విజయనగరం టౌన్ : ఆధ్యాత్మికతతోనే దైవత్వం సిద్ధిస్తుందని నిత్య దైవనామస్మరణ సేవా సమితి వ్యవస్థాపకుడు నారాయణస్వామీజీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత , దైవచింతన అవసరమన్నారు. సమితి అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ, మనిషి నిత్యం దైవనామస్మరణ చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.