ఆధ్యాత్మికతతోనే దైవత్వం


విజయనగరం టౌన్‌ : ఆధ్యాత్మికతతోనే దైవత్వం సిద్ధిస్తుందని నిత్య దైవనామస్మరణ సేవా సమితి వ్యవస్థాపకుడు నారాయణస్వామీజీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత , దైవచింతన అవసరమన్నారు. సమితి అధ్యక్షురాలు డాక్టర్‌ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ, మనిషి నిత్యం దైవనామస్మరణ చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఉమాశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top