పరిశ్రమ తెరవాలని కార్మికుల ధర్నా


అచ్యుతాపురం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని సెజ్‌లో ఉన్న డబ్ల్యూఎస్ పరిశ్రమను వెంటనే తెరవాలని కోరుతూ 200 మంది కార్మికులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మంగళవారం పరిశ్రమ వద్దకు చేరుకున్న కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. పాత బకాయిలను వెంటనే చెల్లించి, తిరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.


హుద్‌హుద్ తుపాన్ ప్రభావంతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే పరిశ్రమను తెరిచి, కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top