సాయం చేయబోతే.. నగలు దోచుకెళ్లాడు


తోటి ప్రయాణికుడికి రైలు ఎక్కేందుకు చెయ్యందించి సాయం చేయబోయిన మహిళ మెడలోని ఆభరణాలను దోచుకెళ్లాడు ఓ చోరుడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.


 


పలాసకు చెందిన వైశ్యరాజ్ అరుణ ఒడిశా రాష్ట్రం ధరంపూర్ జిల్లా నుంచి పలాసకు ఇంటర్‌సిటీ రైలులో ప్రయాణిస్తున్నారు. ఇచ్చాపురం స్టేషన్‌లో రన్నింగ్ లో ఉన్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడికి అరుణ చేయి అందించి సాయం చేయబోయింది. అదే అదనుగా భావించిన యువకుడు ఆమె మెడలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. దీంతో మహిళ వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top