'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు'

'చంద్రబాబుకు మహిళలు గుణపాఠం చెబుతారు' - Sakshi

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌కే పరిమితమైన చంద్రబాబు పల్లె బాట పడితే రైతులు, మహిళలు తగిన గుణపాఠం చెబుతారని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. 

 

ఎన్నికల ప్రచారంలో రైతులకు 9 గంటల విద్యుత్‌ ఇస్తానని చేసిన వాగ్గానం తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన రైతులకు కనీసం 4 గంటల విద్యుత్‌ కూడా ఇవ్వడం లేదని పెద్దిరెడ్డి ఆరోపించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వేరుశనగ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top