పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన బి.కొత్తకోట మండలం కమ్మాలపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన సిద్ధమ్మ(30), రవి(38) భార్యభర్తలు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సిద్ధమ్మ(30) శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగింది. హుటాహుటిన మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సిద్ధమ్మ మధ్యాహ్నాం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు