ఇంట్లోకి వెళ్లి మరీ మహిళలపై 'పచ్చ తమ్ముళ్ల' దాడి

ఇంట్లోకి వెళ్లి మరీ మహిళలపై 'పచ్చ తమ్ముళ్ల' దాడి - Sakshi


విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవదంటూ తెలుగుతమ్ముళ్లు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి హుకుం జారీ చేశారు. అయినా ఆ కుటుంబం మాత్రం తెలుగుతమ్ముళ్ల బెదిరింపులకు వెరవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారు. అంతే తెలుగుతమ్ముళ్ల ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. దాంతో ఆ కుటుంబాన్ని ఊరి నుంచి వెలి వేస్తున్నట్లు తెలుగుతమ్ముళ్లు ప్రకటించారు. దాంతో ఆ కుటుంబంలోని వారంతా ఊరి బయట ఒంటరిగా నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లకు మాత్రం ఆ కుటుంబంపై ఆగ్రహాం ఏ మాత్రం తగ్గలేదు. ఆ క్రమంలో ఆ కుటుంబసభ్యులపై బుధవారం తెలుగుతమ్ముళ్ల దాడికి దిగారు. ఆ దాడిలో ఇంట్లోని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఇంట్లోని వారు నూజివీడు ఆసుపత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top