కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం

కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం - Sakshi


కుప్పం: అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగం కోసం రెండేళ్లుగా టీడీపీ కార్యాలయం చుట్టూ తిరిగింది. తీరా ఇంటర్వ్యూలు అయ్యాక నాయకులు చేతులు ఎత్తేయడంతో మనస్తాపానికి గురైన ఒక మహిళ వుంగళవారం ఆ పార్టీ కార్యాలయుం వద్ద ఆత్మహత్యాయుత్నానికి పాల్పడింది. బాధితురాలి బంధువుల కథనం మేరకు.. గుడుపల్లె వుండలం గుండ్లసాగరం గ్రావూనికి చెందిన అన్నయ్యు భార్య శోభ(32) రెండేళ్ల క్రితం అంగన్‌వాడీ వర్కర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పటి నుంచి ఉద్యోగం రాకపోవడంతో నిరాశ చెందింది. ఎన్నికల సందర్భంగా టీడీపీ గెలుపునకు పని చేస్తే అధికారం రాగానే ఉద్యోగం తీసిస్తామని ఆ పార్టీ స్థానిక నాయుకులు నమ్మించారు.



ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ గెలుపునకు కృషి చేశారు. వారం రోజుల క్రితం కుప్పం వుండల సచివాలయుంలో జరిగిన అంగన్‌వాడీ పోస్టుల ఇంటర్వ్యూలకు శోభ హాజరైంది. ఉద్యోగం రాకపోవడంతో వుంగళవారం పార్టీ కార్యాలయుంలోని సీఎం వ్యక్తిగత కార్యదర్శిని నిలదీసింది. ఆయున అనుకూలంగా మాట్లాడకపోవడంతో వునస్తాపానికి గురైంది. వెంట తీసుకెళ్లిన పురుగుల వుందు తాగేసింది. కార్యాలయుం ఎదుట వాంతులు చేసుకుంటుండగా ఆమె భర్త అన్నయ్యు ఆస్పత్రికి తరలించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top