మహిళ అనుమానాస్పద మృతి


రేపల్లె (గుంటూరు): ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని ఆకుల లక్ష్మీ (40), భర్త చనిపోవడంతో ఒంటరిగానే ఉంటోంది. అయితే శుక్రవారం ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. పోలీసులు అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top