ప్రియుడి వేధింపులే కారణం


ధర్మవరం: ప్రియుడి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కుణుతూరు గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన పర్వీన్‌భాను (25) అనంతపురం పట్టణానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడిని గతంలో ప్రేమించింది. కొన్ని కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఇటీవల పర్వీన్‌కు ఓ వ్యక్తితో వివాహాన్ని పెద్దలు ఖాయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ తననే పెళ్లాడాలంటూ పర్వీన్‌ను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేక పర్వీన్ శనివారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top