రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ మహిళమృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన వైఎస్సార్కడప జిల్లా సుండుపల్లి మండలం రాచవాండ్లపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
సుండుపల్లికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఆటోలో నల్లగంగమ్మ గుడికి వెళ్తున్న సమయంలో కోడి గుడ్ల లోడుతో వస్తున్న టాటాఏస్ను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న అమరావతి(55) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలు అందులో డ్రైవర్ రాజాతో పాటు వెంకటరమణ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.