ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి


పార్వతీపురం (విజయనగరం జిల్లా) : పార్వతీపురం బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. మృతురాలు శ్రీకాకుళం వందెర మండలానికి చెందిన నగరి కోలమ్మ (60) గా గుర్తించారు. గురువారం పార్వతీపురం బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది.



ఈ బస్టాండ్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగడం గత నాలుగు నెలల్లో ఇది నాలుగోసారని, అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top