సీఎం బందోబస్తు వాహనం బోల్తా.. మహిళ మృతి


పోలవరం (పశ్చిమ గోదావరి): సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం యడ్లగూడెం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. సీఎం బందోబస్తు కోసం వచ్చిన పోలీసు జీపు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లి బోల్తా పడింది.


ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏఎస్ఐతో సహా మరొకరికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top