సీఎం బందోబస్తు వాహనం బోల్తా.. మహిళ మృతి
పోలవరం (పశ్చిమ గోదావరి): సీఎం చంద్రబాబు నాయుడు బందోబస్తుకు వచ్చిన ఓ పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం యడ్లగూడెం వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. సీఎం బందోబస్తు కోసం వచ్చిన పోలీసు జీపు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, ఏఎస్ఐతో సహా మరొకరికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత వార్తలు