రైల్వేబ్రిడ్జి కింద మహిళ మృతదేహం
గుంటూరు (మంగళగిరి) : అనుమానాస్పద స్థితిలో రైల్వే బ్రిడ్జి కింద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలోని రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం జరిగింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది తమ పరిధిలోకి రాదని, రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఎక్కడైనా హత్య చేసి తెచ్చి ఇక్కడ పడేశారా, లేక ఇక్కడే హతమార్చారా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నా