వివాహిత బలవన్మరణం
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : కమలాపురం పట్టణంలోని బైండ్కాలనీలో ఆదివారం తెల్లవారుజామున రాములు(25) అనే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. భర్తతో గొడవపడి గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని వివాహిత తరపు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.