పుట్టింటికి పంపించలేదని ఆత్మహత్య


తిరుపతి : పుట్టింటికి పంపించలేదని మనస్తాపం చెంది ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరుపతిలోని చంద్రగిరి రోడ్డు సాయిబాబ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వనజ(29), సతీష్ దంపతులకు ఇద్దరు పిల్లలు. వనజ ఓ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. కాగా పుట్టింటికి వెళ్లి వస్తానని ఆమె ఇటీవల పలుమార్లు భర్తను కోరింది.


కానీ డబ్బులేకపోవడంతో అతడు పంపించలేదు. దీంతో మనస్తాపం చెందిన వనజ మంగళవారం ఇంట్లో భర్త లేని సమయంలో పిల్లలిద్దరినీ ఓ గదిలో పెట్టి బయట గడియపెట్టింది. తర్వాత ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పిల్లల అరుపులు విని ఎదురింటి వారు వచ్చి చూసేలోపే ఆమె మృతి చెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top