భార్యపై యాసిడ్ దాడి.. తీవ్ర గాయాలు


కొడవలూరు(నెల్లూరు జిల్లా): తనతో ఏడడుగులు నడచి జీవితాన్ని పంచుకున్న అర్ధాంగిని కడతేర్చాలని చూశాడో కామాంధుడు. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకుందామని భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చింతచెలక గ్రామంలో శుక్రవారం సాయంత్రం జరిగింది.



గ్రామానికి చెందిన రైతు పొంగూలురి జనార్దన్(30) ఇంటి సమీపంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీనికి భార్య సుకన్య అడ్డుగా ఉందని భావించిన అతడు శుక్రవారం సాయంత్రం ఆమెపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాలైన సుకన్యను 108 వాహనంలో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జనార్దన్, సుకన్య దంపతలకు ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top