మద్యం దుకాణానికి నిప్పంటించిన దుండగులు


చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దోపిడీదొంగలు రెచ్చిపోయారు. మద్యం షాపులో దొంగతనానికి ప్రయత్నించిన దుండగులు డబ్బులు లభించకపోవడంతో.. దుకాణానికి నిప్పంటించారు.


నిమ్మనపల్లిలో బుధవారం రాత్రి రమణ వైన్స్‌లో దొంగలు నిప్పంటించడంతో మద్యం షాపు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల విలువైన మద్యం బాటిల్స్ కాలిబూడిదైనట్లు తెలుస్తుంది. దీనిపై షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top