అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షలు ఇస్తాం

అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షలు ఇస్తాం - Sakshi


అగ్రిగోల్డ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 105 కుటుంబాల వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 10 లక్షలు చేస్తామని, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి వాళ్లకు ఇస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు చేస్తున్న నిరాహార దీక్షల శిబిరం వద్దకు ఇతర వామపక్షాల నాయకులతో కలిసి వెళ్లిన ఆయన.. అక్కడ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే...


అగ్రిగోల్డ్ మీద చర్చకు మేం పట్టుబట్టాం.
దానిపై ముందుగా సీఎం గారు స్టేట్‌మెంట్ చదివేశాడు, తర్వాత పది నిమిషాలు, 20 నిమిషాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు చెప్పారు.
కనీసం బాధితులు పడుతున్న బాధలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలంటే వీలు పడనివ్వలేదు
అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇప్పటివరకు మరణించిన 105 మందికి పరిహారం ఇవ్వాలని అడిగాను
మామూలుగా చనిపోయిన వాళ్లకే 5 లక్షలు ఇస్తున్నప్పుడు.. కనీసం ఈ బాధితులకు ఆ డబ్బు ఇవ్వాలని అడుగుదామంటే వినడానికి వాళ్లకు ఓపిక లేకుండా పోయింది
ప్రత్తిపాటి పుల్లారావు నాకు శత్రువు కాదు, చైర్మన్ తమ్ముడు ఎవరో కూడా తెలియదు
మీరంతా నాకొచ్చి సాక్ష్యాధారాలు నాకు ఇచ్చి, ఇంత అన్యాయం జరుగుతోందని వాపోవడం వల్లే వాళ్ల తప్పులను అసెంబ్లీలో ప్రశ్నించగలిగాను.
మంత్రిగా ఉన్న తర్వాత.. ఆస్తులు అటాచ్‌మెంట్ అవుతున్న విషయం తెలిసి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్యతో తక్కువ రేటుకు కొనిపించారని మీరు చూపించిన డేటాను అసెంబ్లీలో చూపించాను
ఆయన మంత్రిస్థానంలో ఉండి కొన్నారని, అటాచ్‌మెంట్ జరగబోతోందని తెలిసి కొన్నారని చెప్పాను
అమ్మిన వ్యక్తి చైర్మన్ బంధువేనని తెలిపాను, హాయ్‌ల్యాండ్‌లో డైరెక్టర్‌గా ఉన్న విషయం చెప్పి, దీనిపై విచారణ జరిపించాలని కోరాను
సమస్యను పరిష్కరించడానికి ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశాను, ఇప్పుడు కూడా చేశాను.
అగ్రిగోల్డ్ టాపిక్ మాట్లాడుతుంటేనే మైక్ కట్ చేశారు
వాళ్ల తిట్లను ఆశీస్సులుగా తీసుకుంటా.. కనీసం బాధితులకు న్యాయం జరిగితే చాలు అనుకున్నాను
సబ్జెక్టును డీవియేట్ చేయడానికి అగ్రిగోల్డ్ అంశాన్ని పక్కకు పెట్టేశారు. 40 రోజుల క్రితం మహిళా పార్లమెంటు సందర్భంగా స్పీకర్ కాస్త వెటకారంగా 'కార్లు షెడ్డులోనే ఉండాలి, ఆడవాళ్లు వంటింటికే పరిమితం కావాలి. అప్పుడే వాళ్ల మీద రేప్‌లు తగ్గుతాయి' అంటూ చెప్పారు. ఆ మాటలను జాతీయ మీడియాలోని పెద్దపెద్ద పేపర్లు, టీవీ చానళ్లు కూడా చూపించాయి.
కానీ ఈరోజు అగ్రిగోల్డ్ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికి సాక్షి టీవీ చూపించిందని అన్నారు
దానికి, అగ్రిగోల్డ్‌కు సంబంధం ఏముందని అడిగితే పట్టించుకోలేదు.
సభను వాయిదావేసి, 10 నిమిషాలకే మళ్లీ పిలిచి టీవీలు పెట్టి, స్పీకర్ గారు ఆరోజు ఏమన్నారో టీవీలో చూపించారు
చివరకు అగ్రిగోల్డ్ టాపిక్ ఏమైందోనని అడగడానికి కూడా వీల్లేకుండా చేశారు
కౌరవ సభను చూడటానికి కూడా మనసొప్పక బయటకు వచ్చేశాను
కచ్చితంగా దీనిపై పోరాటం చేస్తాము, మరింత గట్టిగా నిలదీస్తాం
అన్ని పార్టీలకు చెందినవాళ్లు మీకు అండగా ఉంటాం
చంద్రబాబు చర్మం మందం కాబట్టి ఫలితం వస్తుందన్న నమ్మకం అంతగా లేదు
చూస్తూ చూస్తూ మూడేళ్లయిపోయింది.. కళ్లు మూసుకుంటే మరో రెండేళ్లు గడుస్తాయి, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం
వచ్చిన పది రోజుల్లోనే 14 లక్షల మందికి 1182 కోట్లను అందేలా చూస్తాం
బాధితుల కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని 10 లక్షలు చేస్తూ, మిగిలిన 7 లక్షల మొత్తాన్ని ఆ కుటుంబాలకు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తాం
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top