ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - Sakshi


గుంటూరు : గుప్తనిధుల కోసం జరిగిన హత్యగా గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చిందని తేల్చిన పోలీసులు మంగళవారం వాళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెంలో చోటుచేసుకుంది.



గుప్తనిధుల వేట కోసం తాడుట్ల ఫారెస్ట్‌లోకి వెళ్లిన సుబానీని.. అతని భార్య యుసుబన్, ప్రియుడు హుస్సేన్ కలిసి బండరాయితో మోది చంపేశారు. ఈ కేసు విచారణను చేపట్టిన పోలీసులు మొదట గుప్తనిధుల కోసం జరిగిన హత్యగా భావించారు. అనంతరం పూర్తి ఆధారాలు సేకరించి భార్య, ఆమె ప్రియుడు కలిసి హతమార్చారని నిర్థారించి వారిని అరెస్టు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top