ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
గుంటూరు : గుప్తనిధుల కోసం జరిగిన హత్యగా గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చిందని తేల్చిన పోలీసులు మంగళవారం వాళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచవరం మండలం తురకపాలెంలో చోటుచేసుకుంది.
గుప్తనిధుల వేట కోసం తాడుట్ల ఫారెస్ట్లోకి వెళ్లిన సుబానీని.. అతని భార్య యుసుబన్, ప్రియుడు హుస్సేన్ కలిసి బండరాయితో మోది చంపేశారు. ఈ కేసు విచారణను చేపట్టిన పోలీసులు మొదట గుప్తనిధుల కోసం జరిగిన హత్యగా భావించారు. అనంతరం పూర్తి ఆధారాలు సేకరించి భార్య, ఆమె ప్రియుడు కలిసి హతమార్చారని నిర్థారించి వారిని అరెస్టు చేశారు.