భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య

భర్త మృతితో భార్య, కూతురు ఆత్మహత్య - Sakshi


శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లో విషాదం చోటుచేసుకుంది. భర్త మృతిని జీర్ణించుకోలేని భార్య, కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.  స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఈ నెల 5వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి భార్య లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. భర్త లేకుండా తాము జీవించలేమంటూ ఆమె పలుమార్లు బంధువుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది.



ఈ నేపథ్యంలో శనివారం ఉదయం లక్ష్మి, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె ప్రసన్నతో కలిసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. కాగా ఆ సమయంలో కుమారుడు ఇంట్లో లేనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top