నీ కులమేంది?..టీడీపీ సభ్యత్వనమోదులో ఆరా


సాక్షి, అమరావతి: తెలుగుదేశంలో క్రియాశీలక సభ్యులుగా చేరే వారి కులమేంటని ఆ పార్టీ ఆరా తీస్తోంది. సభ్యత్వ నమోదు సమయంలో కులం (సామాజికవర్గం) ఏంటో చెప్పాలని గట్టిగా కోరుతోంది. ప్రతి ఒక్కరి సామాజికవర్గం ఏమిటో చెప్పిన తరువాతనే వారిని సభ్యులుగా చేర్పించుకొంటోంది.



ఈ నెల ఒకటో తేదీన ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నెలాఖరు వరకూ కొనసాగుతుంది. వంద రూపాయలు ఇచ్చిన వారిని క్రియాశీలక కార్యకర్తలుగా చేర్చుకోవటంతో పాటు పాత సభ్యత్వాలను పునరుద్ధస్తోంది. సామాజికవర్గం నమోదుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ పొందుపరిచిన యంత్రాలను ఉపయోగిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top