సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి

సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి - Sakshi

  •      రూ.2,200 కోట్లతో హుద్‌హుద్ బాధిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు

  •      ఆంధ్రా యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామని పిలుపు

  •  సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సవాళ్లను అవకాశాలుగా మలచుకుని రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలుపుతామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. హుద్‌హుద్ తుపాను వచ్చి ఏడాదైన సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో పునరంకిత సభను సోమవారం రాత్రి నిర్వహించారు. హుద్‌హుద్ బాధిత ప్రాంతాల్లో  ప్రపంచ బ్యాంకు నిధులు రూ.2,200కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.  కాగా, హుద్‌హుద్ తుపాను వచ్చి ఏడాదైన సందర్భంగా కొందరు తెచ్చిన కేక్‌ను సీఎం కట్ చేశారు. వెంకయ్య నాయుడుకు తినిపిస్తూ  సంబరాలు చేసుకోవడం గమనార్హం. సమావేశం అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చడం విస్మయపరిచింది.

     ఏయూను ప్రపంచ స్థాయికి తీసుకెళ్దాం

     ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.   ఏయూలో సోమవారం రాత్రి జరిగిన ‘అల్యూమినీ మీట్-2015’ కార్యక్రమంలో ఆయన   మాట్లాడారు. ఈసందర్భంగా రూ.14.55 కోట్ల విరాళాలు ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలుగా ఉన్న ఏయూ పూర్వ విద్యార్థులు అందజేశారు. అంతే మొత్తాన్ని కార్పస్‌ఫండ్‌గా ప్రభుత్వం తరపున జోడిస్తున్నట్లు బాబు తెలిపారు. వర్సిటీకి  సెంట్రల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గుర్తింపును కేంద్రం నుంచి తీసుకువచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా రూ.20 లక్షలు విరాళంగా ఇవ్వడంతో పాటు మరి కొంత మందికి చెప్పి రూ.కోటి వరకూ ఏయూకి అందిస్తానని వెంకయ్య ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top