తెలంగాణ ప్రభుత్వ జీఓపై కోర్టుకు వెళతాం: ఏపి మంత్రి రావెల

రావెల కిషోర్ బాబు - Sakshi


హైదరాబాద్: స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏపి సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  రావెల కిషోర్‌బాబు చెప్పారు. తెలంగాణలో  1956కు ముందు ఉన్నవారినే స్థానికులుగా పరిగణించాలని ఆ ప్రభుత్వం జిఓ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ జారీపై ఏపి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.



తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం 1956 తరువాత నుంచి ఇక్కడ ఉన్నవారిని స్థానికులుగా పరిగణించరు. దాంతో విద్యార్థులకు, నిరుద్యోగులకు అనేక చిక్కులు ఇస్తాయి. ఆ జీఓపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మంత్రి కిషోర్ బాబు అడ్వకేట్ జనరల్(ఏజీ)ను సంప్రదించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top