భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..

భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతాం..


కడప : కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని భద్రాద్రి కంటే వైభవంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన శనివారం శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కేఈ కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రూ.4 కోట్లతో ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి ధ్వజారోహణంలో పాల్గొనడం తన అదృష్టమని కేఈ కృష్ణమూర్తి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top