మదనపల్లెలో మరో మెడికల్ కాలేజీకి సహకరిస్తాం


హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఇప్పటికే రెండు మెడికల్ కాలేజీలున్నాయని అధికార పార్టీ సభ్యుడు కామినేని శ్రీనివాస్ అన్నారు. మార్కాపురం ఆస్పత్రిని సందర్శించి సమస్యలు తెలుసుకున్నందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జంకె వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఎవరైనా ఈ జిల్లాలో మరిన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే సహకరిస్తామని తెలిపారు. మదనపల్లిలో మెడికల్ కాలేజీని పెట్టేందుకు ఎవరైనా వస్తే పరిశీలిస్తామని చెప్పారు. అపోలో వాళ్లు చిత్తూరు జిల్లాలో ఆస్పత్రి పెడతామన్నారని దానికి సహకరిస్తామని చెప్పారు. మదనపల్లెను మెడికల్ హబ్గా తీర్చి దిద్దాలని అంతకుముందు తిప్పారెడ్డి డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top