ఏపీ ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా: నిర్మలా సీతారామన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడం కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఇతర రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.