2019 వరకూ ఎన్నికలకు దూరం: పవన్ కల్యాణ్
హైదరాబాద్: 2019 వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఆలోపు జరిగే ప్రతి ఎన్నికకు దూరంగా ఉంటామని జనసేన జనసేన అధ్యక్షుడు, ప్రముఖ హీరో, పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరుగుతోందని ఆ తరువాతే ఎన్నికలకు వెళతామన్నారు. అప్పటివరకూ జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని పవన్ అన్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపై పవన్ కల్యాణ్ గతంలోనే స్పష్టత ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తలు అభిప్రాయం తీసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీ అయిన జనసేన మద్దతు తమ పార్టీకే ఉందని చెపితే నమ్మవద్దని సూచించారు. తాము ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు