'పాఠశాలల మూసివేతకు వ్యతిరేకం'
హైదరాబాద్: సర్దుబాటు పేరుతో పాఠశాలలను మూసివేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్ఆర్టీఎఫ్) పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. జాలిరెడ్డి, కె. ఓబుళపతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో అందరికీ ప్రాథమిక విద్యని అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను మూసివేయాలనుకోవడం దారుణమన్నారు.సర్దుబాటులో పాఠశాలలను మూసివేయకుండా అవసరమైన చోట ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.