జోరుగా ఇసుక రవాణా
కుక్కునూరు : మణుగూరు, ఇల్లెందు ఇసుక ర్యాంపుల నుంచి ఏలూరు, హైద్రాబాద్ తదితర పట్టణాలకు ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. ఆ పట్టణాలనుంచి కుక్కునూరు మీదుగా ప్రతి రోజు సుమారు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు ఇసుకలోడుతో వెళుతున్నాయి. అదేక్రమంలో ఆదివారం రాత్రి ఇసుక లోడుతో వెళుతున్న ఓ లారీ మండలంలోని కొండపల్లి మూలమలుపువద్ద బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 8 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై జేసీబీతో ఇసుకను తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. అయి తే ఆ వాహనాలలో ఇసుకలోడుతో ఉన్న 6 లారీలను పోలీసులు గమనించారు.
వాటికి వేబిల్లులు లేకపోవడంతో అనుమానంలో లారీలను నిలిపివేశారు. బోల్తాపడిన లారీతోపాటు ఏడు ఇసుకలారీలకు సంబంధించిన డ్రైవర్లు, క్లీనర్లను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారిస్తున్నారు. బూర్గంపాడు నుంచి కుక్కునూరు మీదుగా వంద నుంచి రెండువందల కిలోమీటర్ల దూరంలో ఎటువంటి చెక్పోస్టు లేకపోవడంతో ఇసుక రవాణా యథేఛ్చగా సాగుతున్నటు ్లతెలుస్తోంది. అధికారులు, పోలీసుల కళ్లుకప్పి సాగుతున్న ఇసుక రవాణాపై నిఘాపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఇన్చార్జి ఎస్హెచ్వో, హెడ్కానిస్టేబుల్ చారిని ‘న్యూస్లైన్’వివరణ కోరగా మణుగూరు, ఇల్లెందు, బూర్గం పాడు ఇసుక ర్యాంపులనుంచి ఇసుక రవాణా చేస్తున్నారని, వీటికి వే బిల్లులు లేకపోవడంతో ఆరు లారీలను పోలీస్స్టేషన్కు తరలించామని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.