రాళ్లపాడు ప్రాజెక్ట్ ఐదు గేట్ల ఎత్తివేత


లింగసముద్రం: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని రాళ్లవాగు జలాశయానికి భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం ఐదు గేట్లను అడుగు మేర పైకి ఎత్తి 8 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేయడం ప్రారంభించారు. ఇన్‌ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో భారీగా ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని ముందస్తు జాగ్రత్తతో ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top