శ్రీశైలానికి తగ్గిన వరద


శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయానికి మంగళవారం వరద నీటి ప్రవాహం తగ్గింది. ఎగువ పరీవాహక ప్రాంతమైన తుంగభద్ర నుంచి వచ్చే జలాలు మంగళవారం నిలిచిపోయాయి. జలాశయం నుంచి హంద్రీనీవా సుజలస్రవంతికి 1690 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 76.144 టీఎంసీల నీరు నిల్వగా ఉంది. డ్యాం నీటిమట్టం 848.20 అడుగులుగా నమోదైంది. డ్యాం కెపాసిటీ 257 టీఎంసీలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top