డిసెంబర్ 2 నుంచి మావోయిస్టులతో వార్!
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య అసలైన యుద్ధం డిసెంబర్ 2 నుంచి మొదలవుతుందని విశాఖ ఎస్పీ కోయ ప్రవీణ్ చెప్పారు. మావోయిస్టు జాంబ్రి భార్య తమ అదుపులో లేదని ఆయన వెల్లడించారు. కైలాసం అనే పేరుతో మీడియాకు లీకవుతున్న లేఖలపై ఆయన స్పందించారు. కైలాసం నాలుగేళ్ల క్రితమే ఎన్కౌంటర్లో చనిపోయాడని, ప్రస్తుత లేఖలు కైలాసం పేరుతో రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి అలియాస్ చలపతి రాస్తున్నాడని ప్రవీణ్ తెలిపారు.
నిషేధిత మావోయిస్టు పార్టీలో చలపతి అప్పారావుగా చలమాణి అవుతున్నాడని, దీన్ని బట్టి మావోయిస్టులకు స్పష్టత లేదన్న విషయం అర్థమవుతుందని ఎస్పీ అన్నారు. గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం పోలీసులకు లేదని చెప్పారు. ఏవోబీలో బాకూరు వెంకటరమణ, కుడుముల రవి వల్లే మావోయిస్టుల కార్యకలాపాలు నడుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.