ఉపాధి కూలీ రూ. 20


దొరవారిసత్రం: సాధారణంగా రూ. 130 నుంచి 160 వరకూ చెల్లించాల్సిన ఉపాధికూలీ కేవలం రూ. 20 మాత్రమే చెల్లిస్తుండటంతో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండల పరిషత్తు కార్యాలయం వద్ద దర్శనమిచ్చింది. మండలంలోని మల్లెపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది కార్మికులు పరిషత్తు కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పూర్తిగా కూలీ చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top