త్వరలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి షురూ
విశాఖపట్నం: విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో త్వరలో ఉత్పత్తి పునఃప్రారంభంకానుంది. వారం రోజుల్లో ఉత్పత్తి మొదలు పెడతామని అధికారులు తెలిపారు.
తుపాన్ కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో దెబ్బతిన్న యూనిట్లను యధాతథ స్థితికి తీసుకువచ్చినట్టు చెప్పారు. హుదూద్ తుపాన్ కారణంగా ఉత్తరాంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నం తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా భారీ నష్టం వాటిల్లింది.