విశాఖ స్టీల్ప్లాంట్ రూ. 5 కోట్ల విరాళం
విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం విశాఖ ఉక్కు కర్మాగారం రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విశాఖ స్టీల్ప్లాంట్ సీఎండీ పి. మధుసూదన్ అందజేశారు.
విశాఖపట్నం జిల్లాలోని ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీని వెంకయ్య నాయుడు కోరారు. కాగా సీ ఫుడ్స్ అండ్స్ ఎక్స్పోర్ట్స్ కూడా తుపాను బాధితుల సహాయం కోసం రూ. కోటి విరాళం ప్రకటించింది.