విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల

విశాఖ రాజధాని కాకుండా బాబు అడ్డుపుల్ల - Sakshi


విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం రాజధాని కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైజాగ్ సిటిజన్ ఫోరం ఆరోపించింది. మంగళవారం విశాఖపట్నంలో రాజధాని ఎంపికపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై సిటిజన్ ఫోరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేసేందుకు విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది.


రాజధాని ఎంపికపై ఏర్పాటైన ప్రొ. శివరామకృష్ణన్ కమిటీ విశాఖలో గతంలో పర్యటించిందని ఫోరం ఈ సందర్బంగా గుర్తు చేసింది. ఆ సమయంలో రాజధానిగా విశాఖపట్నం నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని కమిటీ చెప్పిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు కాకుండా చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top