జగన్తో విష్ణుకుమార్ రాజు భేటీ
హైదరాబాద్: శాసనసభ శుక్రవారం తొలి విడత వాయిదా పడిన సమయంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. సభలో ప్రతిష్టంభన కొనసాగకుండా చూడాలని, చివరిరోజు సమావేశాలు సజావుగా సాగేలా చూద్దామని కోరారు.
అయితే తాము నోటీసు ఇచ్చిన విధంగా ‘ఓటుకు కోట్లు’ అంశంపై చర్చ జరిగేలా చూడాలని వైఎస్ జగన్ సూచించారు. దీనిపై చర్చ జరిగితే ఇతర అంశాలపైనా చర్చకు సిద్ధమని చెప్పడంతో విష్ణుకుమార్ రాజు వెనుదిరిగారు.