విశాఖలో ఎస్ఐ అనుమానాస్పద మృతి
విశాఖపట్టణం: అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీసు ఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఎస్ఐగా పనిచేస్తున్న వీరాంజనేయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
సింహాచలం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం లభ్యమైంది. గత ఏడాది ఓ అవినీతి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. వీరాంజనేయులు మృతికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.