విశాఖలో ఎస్ఐ అనుమానాస్పద మృతి


విశాఖపట్టణం: అవినీతి కేసులో నిందితుడిగా ఉన్న ఓ పోలీసు ఎస్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఎస్ఐగా పనిచేస్తున్న వీరాంజనేయులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.



సింహాచలం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఆయన మృతదేహం లభ్యమైంది. గత ఏడాది ఓ అవినీతి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు.  వీరాంజనేయులు మృతికి కారణాలు  తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top