విషజ్వరాలతో 20 మందికి అస్వస్థత


దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : విషజ్వరాల కారణంగా జిల్లాలోని దుగ్గిరాల మండలం మంచకలపూడి గ్రామంలో 20 మందికి పైగా గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా గ్రామంలో విషజ్వరాలతో గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం నాటికి గ్రామంలో 20మందికి పైగా గ్రామస్తులు ఈ విషజ్వరాల బారిన పడినట్లు సమాచారం.


కాగా గ్రామంలో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నా జ్వరాలు తగ్గుముఖం పట్టడంలేదు. ఇప్పటికే ఈ గ్రామాన్ని కలెక్టర్ కూడా సందర్శించి అధికారులను మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top